ASBL NSL Infratech
facebook whatsapp X

కాలిఫోర్నియాలో సగం అంకురాలు ప్రవాసులవే

కాలిఫోర్నియాలో సగం అంకురాలు ప్రవాసులవే

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఏర్పాటైన అంకుర సంస్థల్లో 42 శాతం ప్రవాసుల/ వలసదార్లవేనని గవర్నర్‌ గవిన్‌ న్యూసమ్‌ పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన ఒక నిధుల సమీకరణ కార్యక్రమంలో దిగ్గజ భారతీయ అమెరికన్‌ వ్యాపారవేత్తలనుద్దేశించి ప్రసంగించారు. యూఎస్‌ ఇండియా సెక్యూరిటీ కౌన్సిల్‌ ప్రెసిడెంట్‌ రమేశ్‌ విశ్వనాథ్‌ కపుర్‌, ఆయన భార్య సుసాన్‌ ఈ కార్యక్రమం నిర్వహించారు. మొత్తం అంకురాల్లో 42 శాతం వలసదార్లు స్థాపించినవే. మా రాష్ట్రానికి వాళ్లు జీవనాడి లాంటి వారు. స్థానికత, విద్వేషం వంటివి మా రాజకీయాల్లో కలిసిపోయాయి. ముఖ్యంగా డొనాల్డ్‌ ట్రంప్‌ లాంటి వ్యక్తులు ఈ విషయంలో ముందుంటారు. ఇటువంటి పరిస్థితుల్లోనూ కాలిఫోర్నియాలో అంకుర వ్యవస్థ బలంగా నిలబడగలిగింది. భిన్నత్వాన్ని ఆహ్వానించినందు వల్లే తయారీలో ముందున్నాం. అత్యధిక సంఖ్యలో శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నోబెల్‌ గ్రహీతలు మా దగ్గర ఉన్నారని తెలిపారు.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye
Tags :