ASBL Koncept Ambience
facebook whatsapp X

సీఎం చంద్రబాబుతో కేంద్ర బృందం భేటీ

సీఎం చంద్రబాబుతో కేంద్ర బృందం భేటీ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వరద నష్టం అంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర బృందం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయింది. రెండ్రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించింది. ఎన్టీఆర్‌, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలోని వరద ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించింది. వరద నష్టంపై చేపడుతోన్న ఎన్యూమరేషన్‌ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించింది. ప్రాథమికంగా రూ.6,882 కోట్ల మేర నష్టం వాటిల్లిందని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపింది. ఆంధ్రప్రదేశ్‌లో వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర బృదాలను కోరారు. పంట నష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం జరిగిందనే విషయాన్ని కేంద్ర బృందాలకు చంద్రబాబు వివరించారు.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :