ASBL NSL Infratech
facebook whatsapp X

ఆ బాధితుల్ని ఆదుకుంటాం.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన

ఆ బాధితుల్ని ఆదుకుంటాం.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన

గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. శాసనసభలో చంద్రబాబు మాట్లాడుతూ తూర్పు, పశ్చిమగోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాలు వరద ప్రభావానికి గురయ్యాయని తెలిపారు. 4,317 ఎకరాల్లో వరి  పంట దెబ్బతింది. 1.06లక్షల ఎకరాల్లో వరి నాట్లు ముంపునకు గురయ్యాయి. మొక్కజొన్న, పత్తి లాంటి పంటలు కూడా దెబ్బతిన్నాయి. అల్లూరి జిల్లాలోనూ కొన్ని చోట్ల వరద ప్రభావం ఉంది. ఇళ్లు నీట మునిగిన బాధితుల కోసం ప్రభుత్వం సహాయక శిబిరాలు ఏర్పాటు చేసింది.శిబిరాల్లో ఉన్న వారికి రూ.3 వేల చొప్పున ఆర్థిక సాయం, 25 కేజీల బియ్యం, లీటర్‌ పామాయిల్‌,  కందిపప్పు, బంగాళదుంపలు, ఉల్లిపాయలు కేజీ చొప్పున అందిస్తాం. వ్యవసాయశాఖ, హోంశాఖ మంత్రులు క్షేత్రస్థాయికి వెళ్లి వరదబాధితుల్ని పరామర్శించాలని ఆదేశించా. ఢల్లీిలో నీతి ఆయోగ్‌ సమావేశం కారణంగా బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్లలేకపోతున్నా. పంట నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేయాలని మంత్రులు, అధికారులకు ఆదేశాలిచ్చాం అని తెలిపారు.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :