ASBL Koncept Ambience
facebook whatsapp X

హస్తినలోనూ అభివృద్ధిరాగం...

హస్తినలోనూ అభివృద్ధిరాగం...

సీఎంగా పీఠమెక్కిన దగ్గర నుంచి చంద్రబాబు అభివృద్ధి రాగమాలపిస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా, ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా.. ఏపీ అభివృద్ధే లక్ష్యమంటున్నారు. అంతేకాదు.. ఆదిశగా తమ అడుగులు పడుతున్నాయని చెబుతున్నారు. ఢిల్లీలో ప్రధానమంత్రి మోడీ, హోంమంత్రి అమిత్ షా మరో కేంద్రమంత్రి గడ్కరీ సహా పలువురిని కలిసినప్పుడు కూడా చంద్రబాబు.. రాష్ట్రానికి ఏం కావాలో స్వయంగా నివేదించారు కూడా. ఇప్పుడు వాటి ఫలితాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. ఇందులో భాగంగా అమరావతి ఓఆర్ఆర్ కు కేంద్రం పచ్చజెండా కూడా ఊపింది. ఇవి కాక 45 కేంద్ర సంస్థలు తమ కార్యాలయాలను ఏపీలో ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. అయితే కొత్తగా ఏరాష్ట్రం ఏర్పడినా కూడా ఆ రాష్ట్రంలో కేంద్ర సంస్థలు కార్యాలయాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.అయితే అది ఆరాష్ట్రం ప్రయత్నాలను బట్టి ఉంటుందని చెప్పవచ్చు.

అమరావతి పరుగులు...

రాజ‌ధాని అమ‌రావ‌తిని ప‌రుగులు పెట్టిస్తామ‌న్నారు చంద్రబాబు. 2014-19 మ‌ధ్య చేప‌ట్టిన ప‌నుల‌ను త్వ‌రిత గ‌తిన పూర్తి చేస్తామ‌ని చంద్ర‌బాబు చెప్పారు. అమ‌రావ‌తిలో కీల‌క‌మైన ఐకానిక్ భ‌వ‌న స‌ముదాయాన్ని పూర్తి చేయ‌డం ద్వారా.. రాజ‌ధానికి కొత్త‌రూపం తీసుకువ‌స్తామ‌న్నారు. ఈ సంద‌ర్భంగా కొంద‌రు మీడియా మిత్రులు కీల‌క ప్ర‌శ్న సంధించారు. మ‌రోసారి జ‌గ‌న్ అదికారంలోకి వ‌స్తే.. ఏం చేస్తారు? అని అడిగారు.ఈ ప్ర‌శ్న‌కు చంద్ర‌బాబు స్పందిస్తూ.. “ఆ డెవిల్‌ను త‌రిమికొట్టాం. నియంత్రించాం. ఎవ‌రికి ఇబ్బందులు ఉండ‌వు” అని చెప్పారు.

సంపద సృష్టికి..

రాష్ట్రంలో సంప‌ద సృష్టిస్తాన‌ని ఎన్నిక‌ల స‌మ‌యంలో చెప్పార‌ని.. అది ఎలా సాధ్య‌మ‌ని మ‌రికొంద‌రు ప్ర‌శ్నించారు. మాన‌వ వ‌న‌రులే పెట్టుబ‌డిగా సంప‌ద‌ను సృష్టిస్తామ‌ని చంద్ర‌బాబు చెప్పారు. స్మాల్‌, మీడియం, లార్జ్ స్కేల్ టైం బౌండ్‌తో ఉపాధి అవ‌కాశా లు క‌ల్పించ‌నున్న‌ట్టు వివ‌రించారు. దీనికిగాను పీపీపీ స్థానంలో పీ-4 విధానాన్ని తీసుకురానున్న‌ట్టు వివ‌రించారు. ఇది అమ‌లు చేస్తున్న తొలి రాష్ట్రంగా కూడా.. ఏపీనే గుర్తింపు ద‌క్కించుకుంటుంద‌న్నారు.

పెట్టుబడుల కోసం అన్వేషణ... ఇక‌, పెట్టుబ‌డుల విష‌యంపై అడిగిన‌ప్ర‌శ్న‌ల‌కు సంబంధించి.. చంద్ర‌బాబు స‌మాధాన మిచ్చారు. దావోస్‌లో నిర్వ‌హించే పెట్టుబ డుల స‌ద‌స్సుకు హాజ‌రవుతామ‌ని.. రాష్ట్రానికి ఏ కోణంలో, ఏ రూపంలో అవ‌కాశం ఉన్నా.. ఖ‌చ్చితంగా పెట్టుబడులు తీసుకువ స్తాన‌ని చెప్పారు. 2014-19 మ‌ధ్య రాష్ట్రంలో పెట్టుబ‌డులు వ‌చ్చేందుకు ఎంతో అవ‌కాశం, వాతావ‌ర‌ణం క‌ల్పించామ‌న్న ఆయ‌న జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. పెట్టుబ‌డి దారుల‌ను బెదిరించార‌ని.. వారిని పంపించేశార‌ని చెప్పారు. అయితే.. ఇప్పుడు మ‌ళ్లీ పాత రోజులు తీసుకురానున్న‌ట్టు తెలిపారు. పెట్టుబ‌డి దారుల‌కు ఇబ్బంది లేని వాతావ‌ర‌ణం క‌ల్పించ‌నున్న‌ట్టు తెలిపారు.

కేంద్రంలో ప‌ద‌వుల విష‌యంపై అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స్పందించిన చంద్ర‌బాబు.. త‌మ‌కు ఎలాంటి అసంతృప్తీ లేద‌న్నారు. కేంద్రంలో రెండు మంత్రి ప‌ద‌వులు ఇచ్చార‌ని.. దీంతో సంతృప్తిగానే ఉన్నామ‌న్నారు. గ‌తంలో ఉన్న‌ట్టుగా ప్ర‌స్తుత ప‌రిస్థితి లేవ‌ని.. కాబ‌ట్టి.. కేంద్ర ప్ర‌భుత్వ ప‌రిస్థితిని కూడా అర్ధం చేసుకున్నామ‌న్నారు. దేశం, రాష్ట్రం అభివృద్ధి చెంద‌డ‌మే ల‌క్ష్యంగా అడుగులు వేస్తున్నామన్నారు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :