చంద్రబాబుకు హైదరాబాద్లో ఘన స్వాగతం
తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు హైదరాబాద్లో ఘన స్వాగతం లభించింది. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తొలిసారి హైదరాబాద్కు వచ్చారు. ఢల్లీి నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం చేరుకున్న ఆయనకు తెలంగాణ టీడీపీ నేతలు భారీ గజమాలతో స్వాగతం పలికారు. ఆయన వెంట కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు జనార్దన్ రెడ్డి, పయ్యావుల కేశవ్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఉన్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి జూబ్లీహిల్స్లో బాబు నివాసం వరకు నిర్వహించిన ర్యాలీకి కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు.
Tags :