ASBL Koncept Ambience
facebook whatsapp X

అమరావతిలో డ్రోన్‌ సమ్మిట్‌ ప్రారంభం

అమరావతిలో డ్రోన్‌ సమ్మిట్‌ ప్రారంభం

అమరావతిలో  డ్రోన్‌ సమ్మిట్‌-2024 ప్రారంభమైంది. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో దీనిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. రెండు రోజులపాటు జాతీయ స్థాయిలో ఇది  జరగనుంది. సదస్సులో తొమ్మిది ప్యానల్‌ డిస్కషన్లు, 50 స్టాళ్లలో డ్రోన్ల ప్రదర్శన, రాష్ట్ర ముసాయిదా డ్రోన్‌ పాలసీ పత్రం ఆవిష్కరణ తదితర కార్యక్రమాలు ఉంటాయి. డ్రోన్ల రంగంలో రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానానికి చేర్చేందుకు ఈ సదస్సు తొలి అడుగుగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కార్యక్రమానికి కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు హాజరయ్యారు. పౌర విమానయాన శాఖ, డీఎఫ్‌ఐ,  సీఐఐ భాగస్వామ్యంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :