స్పెయిన్ రాయబారితో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ
స్పెయిన్ రాయబారి జువాన్ ఆంటోనియో మార్చ్ పుజోల్ (Juan Antonio March Pujol) గారు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన పలు కార్యక్రమాలపై జువాన్ గారు ఆసక్తి కనబర్చారు. ముఖ్యంగా రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. స్పెయిన్ దేశాన్ని సందర్శించాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా జువాన్ గారు రాసిన 'Momentum' పుస్తకాన్ని ముఖ్యమంత్రి గారికి అందజేశారు. భేటీలో ఉన్నతాధికారులు కూడా ఉన్నారు.
Tags :