ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళతా : రేవంత్
‘నేను ఫామ్ హౌస్ ముఖ్యమంత్రిని కాదు.. పనిచేసే ముఖ్యమంత్రిని. రాష్ట్ర హక్కుల సాధన కోసం ఎన్ని సార్లు అయినా ఢిల్లీకి వెళ్తా’’ అని సీఎం రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా గన్ పార్క్ వద్ద అమరవీరులకు సీఎం రేవంత్ నివాళులర్పించారు. అనంతరం పబ్లిక్ గార్డెన్స్లో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సెప్టెంబరు 17న ప్రజాపాలన దినోత్సవం జరపాలని నిర్ణయించామని, విలీనం, విమోచనం అంటూ స్వప్రయోజనాల కోసం ప్రవర్తించడం సరికాదని అన్నారు.
సాయుధ పోరాటానికి దొడ్డి కొమరయ్య బీజం వేశారు. రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు పోరాడారన్నారు. ఈ సందర్భంగా నిజాంపై దాశరథి వ్యాఖ్యలను సీఎం రేవంత్ రెడ్డి చదివి వినిపించారు.ప్రజాపాలన దినోత్సవంగా సెప్టెంబర్ 17సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకోవడం సముచితం. నాడు తెలంగాణ ప్రజల విజయం.. అందుకే ప్రజాపాలన దినోత్సవం జరుపుతున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు.