మిస్సయిన అమ్మాయిని.. 48 గంటల్లో పట్టుకున్నాం : పవన్ కల్యాణ్
![మిస్సయిన అమ్మాయిని.. 48 గంటల్లో పట్టుకున్నాం : పవన్ కల్యాణ్](https://www.telugutimes.net/storage/news/news_new_75365.jpg)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడపిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. కాకినాడ కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల తన కూతురు కిడ్నాప్నకు గురైందని ఓ మహిళ నాకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశాం. పోలీసులు అద్భుతంగా పనిచేసి జమ్మూకశ్మీర్లో ఆ అమ్మాయి ఆచూకీ గుర్తించారు. 9 నెలల క్రితం మిస్సయిన అమ్మాయి కేసును 48 గంటల్లో చేధించారు. అక్కడి పోలీసుల సాయంతో వారిని విజయవాడ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాననంటే ప్రభుత్వం తలచుకుంటే ఏం చేయగలదు అని నిరూపించడానికే. గత అయిదేళ్లలో ఎంత మంది ఆడపిల్లలు అదృశ్యమైనా అప్పటి ప్రభుత్వంలో కదలిక రాలేదు. ప్రస్తుత పాలనలో జరిగిన మార్పును ప్రజలు గమనించాలి. తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆడపిల్లల అదృశ్యంపైన పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసేలా చూస్తా. పోలీసుల సంఖ్యాబలం పెరగాల్సిన అవసరం ఉందన్నారు.
![praneet](/storage/article-ads/radha-county.jpg)
![praneet](/storage/article-ads/loft.jpeg)
![praneet](/storage/article-ads/praneet-ads.jpg)
![obili-garuda](/storage/article-ads/obili-garuda-ads.jpg)
![Vertex](/storage/article-ads/vertex.jpeg)
![poulomi](/storage/article-ads/poulomi-ads.jpg)
![Png-jewelry](/storage/article-ads/png-jewelry-ads.jpg)