ధనుష్ నాలుగో సినిమాకు రంగం సిద్ధం?
తమిళ స్టార్ హీరో ధనుష్ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈ ఏడాది ఆయన్నుంచి కెప్టెన్ మిల్లర్, రాయన్ సినిమాలు రిలీజయ్యాయి. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర అనే సోషల్ డ్రామా చేస్తున్న ధనుష్ ఈ సినిమాను వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. అయితే ధనుష్ ఓ పక్క హీరోగా నటిస్తూనే మరోవైపు డైరెక్టర్ గా కూడా సినిమాలు తీస్తున్నాడనే సంగతి అందరికీ తెలిసిందే.
రీసెంట్ గా ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన రాయన్ సినిమా భారీ అంచనాలతో రిలీజైన బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను రాబట్టింది. రాయన్ ఏకంగా రూ.150 కోట్లు కలెక్ట్ చేసింది. రీసెంట్ గా ఓటీటీలో రిలీజై అక్కడా మంచి వ్యూస్ తో దూసుకెళ్తుంది. అయితే రాయన్ సినిమాలో ధనుష్ డైరెక్షన్ కు మాత్రం మిక్డ్స్ రెస్పాన్సే వచ్చింది.
ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో నిలవుకు ఎన్మెల్ ఎన్నడి కోబమ్ రూపొందుతుండగా ఈ సినిమా రీసెంట్ గానే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఇది ధనుష్ దర్శకత్వంలో వస్తున్న మూడో సినిమా కాగా ఇప్పుడు నాలుగో సినిమాకు కూడా రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. అరుణ్ విజయ్ హీరోగా ధనుష్ దర్శకత్వంలో సినిమా త్వరలోనే స్టార్ట్ కానుందని కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఆ సినిమాలో ధనుష్ కూడా కీలక పాత్రలో నటించనున్నాడని సమాచారం. మరి ఇందులో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది.