ఏపీ, తెలంగాణ కు డా. పైళ్ల మల్లారెడ్డి రెండు కోట్ల విరాళం
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వరదలు భీబత్సమ్ సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ విపత్కర పరిణామాలకు చలించి, ఎప్పుడు దాత్రుత్వంలో పెద్ద చేయిగా నిలిచే మన అమెరికా పెద్దన్న, సైజెన్ గ్రూపు అధినేత, డా. పైళ్ల మల్లారెడ్డి గారు సైజెన్ ఫార్మస్యూటికల్స్ గ్రూప్ ద్వారా, రెండు రాష్ట్రాలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి, చెరొక కోటి రూపాయలు విరాళం అందించారు. సోమవారం సైజెన్ ప్రతినిధుల బృందం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని తన నివాసంలో కలిసి కోటి రూపాయల చెక్కును అందించారు. దీనికి ముఖ్యమంత్రి గారు డా. పైళ్ల మల్లారెడ్డి మరియు సైజెన్ బృందానికి కి ధన్యవాదాలు తెలియజేసారు.
Tags :