ASBL NSL Infratech

ఆయన ఎప్పటికైనా బీజేపీలోకి వెళ్తారు : రామ్మోహన్‌రెడ్డి

ఆయన ఎప్పటికైనా బీజేపీలోకి వెళ్తారు : రామ్మోహన్‌రెడ్డి

మళ్లీ అధికారంలోకి వస్తామని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పగటి కలలు కంటున్నారని పరిగి ఎమ్మెల్యే డాక్టర్‌ రామ్మోహన్‌ రెడ్డి ఎద్దెవా చేశారు. అసెంబ్లీ సీఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ  మాజీ మంత్రి,  బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి కోరితేనే విద్యుత్‌ కొనుగోళ్ల  వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్‌ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అవినీతి బయటపడుతుందనే జస్టిస్‌ ఎల్‌. నరసింహారెడ్డి కమిషన్‌ ముందుకు కేసీఆర్‌ హాజరుకాలేదు. ఢిల్లీ మద్యం కేసు నుంచి తన కుమార్తె కవితను కాపాడుకునేందుకు బీజేపీతో ఆయన లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు. అధికారంలో ఉండగా రూ.7 లక్షల కోట్లు అప్పులు చేశారు. వేలాది కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు. హరీశ్‌రావు మాటలు నమ్మొద్దు. ఆయన ఎప్పటికైనా బీజేపీలోకి వెళ్తారు. ఇప్పటికైనా కేసీఆర్‌ అసెంబ్లీకి వచ్చి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలి.  నీళ్లు, నిధులు, నియామకాలు కావాలని రేవంత్‌ రెడ్డిని ప్రజలు ముఖ్యమంత్రిగా కోరుకున్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో రుణమాఫీ చేస్తున్నారు. ఇప్పటికే మా ప్రభుత్వం 30 వేల ఉద్యోగాలు ఇచ్చింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఫాంహౌస్‌కు పిలిచి భోజనాలు పెడితే సరిపోదు. రాజకీయ భవిష్యత్తు, నియోజకవర్గ అభివృద్ధి కోసమే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారు అని అన్నారు. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :