ఆరు గ్యారంటీల్లో ఒక్కటి కూడా... పూర్తి చేసే సత్తా కాంగ్రెస్కు
రుణమాఫి పూర్తిగా సాధ్యం కాదని తెలిసి కూడా కాంగ్రెస్ నేతలు హామీలు ఇచ్చారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆరు గ్యారంటీల్లో ఒక్కటి కూడా పూర్తి చేసే సత్తా కాంగ్రెస్కు లేదని గతంలోనే చెప్పానని అన్నారు. ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన బీజేపీ ప్రజాప్రతినిధుల 24 గంటల రైతు హామీల సాధన దీక్షలో ఈటల మాట్లాడారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం మాత్రమే పూర్తిగా అమలు చేశారన్నారు. రూ.లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి అప్పట్లో కేసీఆర్ కూడా పూర్తి చేయలేదు. నిరుద్యోగులకు నిరుద్యోగభృతి హమీని కూడా ఆయన నెరవేర్చలేదు. రూ.లక్ష రుణమాఫీకి రూ.24 వేల కోట్లు అవసరమైతే, కేవలం 14 వేల కోట్లు ఇచ్చారు అని అన్నారు.
Tags :