ASBL Koncept Ambience
facebook whatsapp X

కేంద్రంలో మోదీ సర్కార్‌ వచ్చాక.. ఉగ్రవాదంపై ఉక్కుపాదం

కేంద్రంలో మోదీ సర్కార్‌ వచ్చాక.. ఉగ్రవాదంపై ఉక్కుపాదం

ఎవరో దుండగులు తమ ర్యాలీలో చొరబడి కుట్ర చేశారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ  ఇటీవల సికింద్రాబాద్‌లో ప్రశాంత వాతావరణంలో ర్యాలీ నిర్వహించాం. బీజేపీ కార్యకర్తల ముసుగులో కొందరు చేరి రాళ్లు, చెప్పులు విసిరారు. పారిపోతున్న వారిని పట్టుకుని మరి పోలీసులు చితకబాదారు. కాషాయ పార్టీ ఎప్పుడూ ప్రజల రక్షణ, శాంతిని మాత్రమే కాంక్షిస్తుంది. ప్రతీకారం అనేది మా పార్టీలో ఉండదు. కాంగ్రెస్‌ పార్టీ పేరుకే లౌకికవాదం కానీ, మతోన్మాదులను ప్రోత్సహిస్తోంది. కాంగ్రెస్‌ హాయాంలో హైదరాబాద్‌లో అనేక సందర్భాల్లో బాంబులు పేలాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కేంద్రంలో మోదీ సర్కార్‌ వచ్చాక ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతోంది అని అన్నారు.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :