ASBL Koncept Ambience
facebook whatsapp X

ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాల్సిందే – చంద్రబాబు

ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాల్సిందే – చంద్రబాబు

తిరుమల శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ టిటిడి నిబంధనలు పాటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు”. భక్తుల మనోభావాలు, ఆచారాలకు భిన్నంగా ఏ ఒక్కరూ వ్యవహరించొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయం కోట్లాది మంది హిందువులకు అతిపెద్ద పుణ్యక్షేత్రం. ఈ దివ్యక్షేత్రం ఏపీలో ఉండటం మనందరి అదృష్టం. ఏడుకొండలవాడి పవిత్రతను కాపాడేందుకు, భక్తుల మనోభావాలను పరిరక్షించేందుకు మా ప్రభుత్వం ఎప్పుడూ అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. 

 తిరుమల దర్శనానికి వెళ్లే ప్రతి భక్తుడు అత్యంత నియమనిష్టలతో, శ్రద్ధాసక్తులతో స్వామివారిని ఆరాధిస్తారు. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ క్షేత్ర పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ ఆలయ నియమాలు, ఆగమశాస్త్ర ఆచారాలను, టిటిడి నిబంధనలను తప్పక పాటించాలని కోరుతున్నా. భక్తుల మనోభావాలకు, ఆలయ ఆచారాలకు భిన్నంగా ఎవరూ వ్యవహరించొద్దని విజ్ఞప్తి చేస్తున్నా” అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

 

 

 

 


 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :