మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ ఇక లేరు
![మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ ఇక లేరు](https://www.telugutimes.net/storage/news/news_new_75240.jpg)
ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్(59) కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి ఉట్నూర్లోని తన నివాసంలో అస్వస్థతకు గరికావడంతో కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు తీసుకువస్తుండగా, మార్గమధ్యంలో ఇచ్చోడ వద్ద తుది శ్వాస విడిచారు. టీడీపీ తరపున 1999లో ఖానాపూర్ ఎమ్మెల్యేగా రమేష్ రాథోడ్ ఎన్నికయ్యారు. 2009లో ఆ పార్టీ నుంచి ఆదిలాబాద్ ఎంపీగా గెలుపొందారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా టీడీపీ నుంచి బీఆర్ఎస్లో చేరారు. అనంతర పరిణామాల్లో కాంగ్రెస్లో చేరి 2019లో ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బీజేపీలోకి వెళ్లారు. ఎంపీ టికెట్ కోసం ప్రయత్నించారు. రమేష్ రాథోడ్ మృతి పట్ల పలువురు నేతలు సంతాపం ప్రకటించారు.
![praneet](/storage/article-ads/radha-county.jpg)
![praneet](/storage/article-ads/loft.jpeg)
![praneet](/storage/article-ads/praneet-ads.jpg)
![obili-garuda](/storage/article-ads/obili-garuda-ads.jpg)
![Vertex](/storage/article-ads/vertex.jpeg)
![poulomi](/storage/article-ads/poulomi-ads.jpg)
![Png-jewelry](/storage/article-ads/png-jewelry-ads.jpg)
Tags :