ASBL NSL Infratech

మాజీ ఎంపీ రమేష్‌ రాథోడ్‌ ఇక లేరు

మాజీ ఎంపీ రమేష్‌ రాథోడ్‌  ఇక లేరు

ఆదిలాబాద్‌ మాజీ ఎంపీ రమేష్‌ రాథోడ్‌(59) కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి ఉట్నూర్‌లోని తన నివాసంలో అస్వస్థతకు గరికావడంతో కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తీసుకువస్తుండగా, మార్గమధ్యంలో ఇచ్చోడ వద్ద తుది శ్వాస విడిచారు. టీడీపీ తరపున 1999లో ఖానాపూర్‌ ఎమ్మెల్యేగా రమేష్‌ రాథోడ్‌ ఎన్నికయ్యారు. 2009లో ఆ పార్టీ నుంచి ఆదిలాబాద్‌ ఎంపీగా గెలుపొందారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా టీడీపీ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరారు. అనంతర పరిణామాల్లో కాంగ్రెస్‌లో చేరి 2019లో ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బీజేపీలోకి వెళ్లారు. ఎంపీ టికెట్‌ కోసం ప్రయత్నించారు. రమేష్‌ రాథోడ్‌ మృతి పట్ల పలువురు నేతలు సంతాపం ప్రకటించారు. 
 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :