ASBL Koncept Ambience
facebook whatsapp X

ఎల‌క్షన్ కమిషనర్‌ గా రాణి కుముదిని

ఎల‌క్షన్ కమిషనర్‌ గా రాణి కుముదిని

రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా (ఎస్ఈసీ) రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాణి కుముదిని నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆ పదవిలో పార్థసారథి కొనసాగారు. ఆయన పదవీకాలం ఇటీవల ముగియడంతో రాణి కుముదిని ప్రభుత్వం నియమించింది. 1988 బ్యాచ్కు చెందిన కుమిదిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్ర సర్వీసుల అనంతరం తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు చేపట్టారు.

2023 ఎన్నికలకు ముందు పదవీ విరమణ చేశారు. నాటి కేసీఆర్ ప్రభుత్వం ఆమెని తిరిగి అదే హోదాలో కొనసాగించింది. రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్గా విశ్రాంత ఐఏఎస్ ఎంజీ గోపాల్ను ప్రభుత్వం నియమించింది. 1983 బ్యాచ్కు చెందిన గోపాల్ ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆయనను రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్గా మూడేండ్ల పాటు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :