జిడబ్ల్యుటీసిఎస్ బ్యాడ్మింటన్ పోటీలు విజయవంతం
గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం (జిడబ్ల్యుటీసిఎస్) గోల్డెన్ జూబ్లీ వేడుకలను పురస్కరించుకుని సెప్టెంబర్ 8వ తేదీన నిర్వహించిన బ్యాడ్మింటన్ పోటీలకు మంచి స్పందన వచ్చింది. యాష్ బర్న్లోని నార్తర్న్ వర్జీనియా బ్యాడ్మింటన్ క్లబ్ (ఎన్విబిసి) లో జరిగిన ఈ పోటీల్లో 300 మంది పాల్గొన్నారు. మిక్స్డ్ డబుల్స్, డబుల్స్ పోటీలను పెద్దలకు నిర్వహించారు. చిన్నారులకు సింగిల్స్, డబుల్స్ విభాగంలో నిర్వహించారు. విజేతలకు 3000 డాలర్లను ప్రైజ్ మనీగా ఇచ్చారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు కృష్ణ లాం మాట్లాడుతూ, బ్యాడ్మింటన్ పోటీలకు ఇంత మంచి స్పందన రావడం సంతోషంగా ఉందని, ఈ పోటీల్లో విజేతగా నిలిచినవారిని ఆయన అభినందించారు. అలాగే ఈ పోటీల విజయవంతానికి కృషి చేసినవారందరికీ కృష్ణ లాం ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో రవి అడుసుమిల్లి, సుశాంత్ మన్నె, చంద్ర మాలావతు, శ్రీనివాస్ గంగ, సతీష్ వేమన, సతీష్ చింత తదితరులు పాల్గొన్నారు. ఈ పోటీలను చక్కగా నిర్వహించిన స్పోర్ట్స్ కమిటీ చైర్ సురేంద్ర ఓంకారం, దినకర చొప్ప, రాజేష్ కాసరనేని, భాను ఇమ్మడి, శ్రీకాంత్ తుమ్మలను అధ్యక్షుడు కృష్ణ లాం అభినందించారు.