జీడబ్ల్యూటీసీఎస్ స్వర్ణోత్సవ వేడుకల పోస్టర్ విడుదల
సెప్టెంబర్ 27, 28 తేదీల్లో వర్జీనియాలో నిర్వహిస్తున్న బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (జీడబ్ల్యూటీసీఎస్) స్వర్ణోత్సవ వేడుకలకు హాజరు కానున్న అతిథుల పోస్టర్ను ఆ సంస్థ అధ్యక్షుడు లాం కృష్ణ కార్యవర్గ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు.
ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, హోం మంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, గుమ్మడి గోపాలకృష్ణ, రామజోగయ్య శాస్త్రి, అంజలి, ఆలీ, శర్వానంద్, జొన్నవిత్తుల తదితరులు ఈ వేడుకల్లో పాల్గొంటున్నారని కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు సతీష్ వేమన, రవి అడుసుమిల్లి, సుశాంత్ మన్నె, సుధ పాలడుగు, సుష్మ అమృతలూరి, భాను మాగులూరి, చంద్ర మాలవతు, సతీష్ చింత (తానా ఆర్విపి), సుధీర్ కొమ్మి (ఎన్నారై టిడిపి), ప్రదీప్ గౌరినేని తదితరులు పాల్గొన్నారు.
Tags :