బహిరంగ క్షమాపన చెప్పకుంటే .. పరువు నష్టం దావా వేస్తా
ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనపై బురదజల్లే వికృత రాజకీయాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపుతోందని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను పక్కకు మళ్లించటానికి గోబెల్స్ ప్రచారాలను ఆశ్రయిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఎలా ఉందంటే, గోల్కోండ కోట, చార్మినార్లలో కూడా హరీశ్రావుకు, వాటాలు ఉన్నాయి అనేటట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. తప్పుడు ప్రచారాలు చేస్తున్నందుకుగాను లీగల్ నోటీస్ పంపుతున్నాను. బహిరంగ క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ హెచ్చరించారు.
Tags :