ఇదేం ప్రజాస్వామ్యం.. ఇదేం ప్రజాపాలన : హరీశ్రావు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపై దాడి జరిగిందని, ఈ ఘటనను ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు తెలిపారు. ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేం ప్రజాపాలన, ఇదేం ఇందిరమ్మ రాజ్యం అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మా పార్టీ ఎమ్మెల్యేను కాంగ్రెస్లో చేర్చుకుని మాపైనే దాడి చేయించడం దుర్మార్గం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాడులు చేయించడం హేయమైన చర్య. కాంగ్రెస్ విద్రోహ, వికృత, అప్రజాస్వామిక వైఖరిని ఖండిస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో జరిగిన దాడి ఇది. సీఎం వెంటనే ఎమ్మెల్యే కౌశిక్రెడ్డికి క్షమాపణ చెప్పాలి. దాడిని నిలువరించడంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ విఫలమైంది. కౌశిక్రెడ్డికి పూర్తి భద్రత కల్పించాలి అని డిమాండ్ చేశారు.
Tags :