ASBL NSL Infratech
facebook whatsapp X

శాంతిభద్రతల గురించి మాట్లాడే హక్కు ఆయనకు ఉందా? : హోంమంత్రి అనిత

శాంతిభద్రతల గురించి మాట్లాడే హక్కు ఆయనకు ఉందా? : హోంమంత్రి అనిత

రాష్ట్రంలో ఇప్పటికీ టీడీపీ కార్యకర్తలపై దాడులు కొనసాగుతున్నాయని ఆంధ్రప్రదేశ్‌ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. అసెంబ్లీలో అనిత మాట్లాడారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తూ ఢిల్లీ వీధుల్లో సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మంత్రి నారా లోకేశ్‌ రెడ్‌బుక్‌ గుర్తొస్తే ఆఅయనకు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 36 హత్యలు జరిగాయని ఢల్లీిలో అబద్ధాలు చెప్పారు. హత్యకు గురైనవారి పేర్లు అడిగితే ఆయన చెప్పలేకపోయారు. అసెంబ్లీకి వచ్చి ఆ పేర్లు చెప్పే దమ్ము జగన్‌కు లేదా? అసెంబ్లీలో అడగకుండా ఢల్లీిలో మాట్లాడితే ఏం లాభం? రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఆయన కుట్ర చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించారో మర్చిపోయారా? శాంతిభద్రతల గురించి మాట్లాడే హక్కు ఆయనకు ఉందా? హోంమంత్రిగా జగన్‌ను అసెంబ్లీకి ఆహ్వానిస్తున్నా. హత్యల వివరాలు అందిస్తే తగిన విచారణ చేయిస్తాం. తప్పుడు వివరాలు ఇచ్చినట్టు తేలినా చర్యలు తీసుకుంటాం అని అనిత నిలదీశారు.

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :