నటి నుంచి నిర్మాతగా బాలయ్య హీరోయిన్
హనీ రోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరసింహా రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో బాగా పాపులర్ అయిన అమ్మడు నటిగా ఎంతో సీనియర్. వివిధ భాషల్లో ఎన్నో సినిమాలు చేసింది. కెరీర్ స్టార్టింగ్ లోనే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఎక్కువ పాపులరైంది మాత్రం బాలయ్య సినిమాతోనే. ప్రస్తుతం సౌత్ లో ఎక్కువగా సినిమాలు చేస్తోంది హనీ రోజ్.
ఇదిలా ఉంటే ఇప్పుడు హనీ రోజ్ తాజాగా సొంత బ్యానర్ ను స్థాపించింది. హనీ రోజ్ వర్గీస్ ప్రొడక్షన్స్ పేరుతో బ్యానర్ ను స్టార్ట్ చేసి ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేస్తూ దానికి సంబంధించిన లోగోను కూడా మార్కెట్ లోకి వదిలింది. సినిమా అనేది చాలా మందికి కల అని, అదొక జీవిత కోరిక అని తెలిపింది.
సినిమా రంగంలో 20 ఏళ్లుగా ఉన్న తను దీన్ని ఓ వరంలా భావిస్తున్నానని, ఆడియన్స్ ఆదరణ వల్ల ఈ స్థాయిలో ఉన్నానని, ఈ ప్రేమ ఎపపటికీ కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు హనీ రోజ్ తెలిపింది. బ్యానర్ ను అయితే అనౌన్స్ చేసింది కానీ ఫస్ట్ సినిమా ఏ హీరోతో అనేది మాత్రం ఇంకా చెప్పలేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి నటిగా కెరీర్ ను స్టార్ట్ చేసి ఇప్పుడు నిర్మాతగా మారడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. హనీ రోజ్ బ్యానర్ నుంచి మంచి మంచి సినిమాలు రావాలని ఆశిద్దాం.