తేజూ సినిమాకు అంత బడ్జెటా?
పవన్ కళ్యాణ్ తో బ్రో సినిమా చేశాక సాయి ధరమ్ తేజ్ కొంత కాలం పాటూ సినిమాల నుంచి గ్యాప్ తీసుకున్నాడు. తర్వాత సితార బ్యానర్ లో సంపత్ నందితో గాంజా శంకర్ సినిమాను అనౌన్స్ చేశాడు కానీ ఆ సినిమా ఆగిపోయిందని తెలుస్తోంది. స్క్రిప్ట్ విషయంలో ఏకాభిప్రాయం వల్లే ఈ సినిమా పట్టాలెక్కడం లేదని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే సాయి ధరమ్ తేజ్ తన తర్వాతి సినిమాను హనుమాన్ సినిమాను నిర్మించిన బ్యానర్ ప్రైమ్ షో బ్యానర్ లో చేయనున్నాడు. ఈ సినిమాకు సుమారు రూ.125 కోట్ల వరకు బడ్జెట్ పెడుతున్నట్లు సమాచారం. ఇంత పెద్ద బడ్జెట్ సాయి ధరమ్ తేజ్ మీద పెడితే అది వర్కవుట్ అవుతుందా అని అందరూ అనుమానపడుతున్నారు.
కానీ నిర్మాత నిరంజన్ రెడ్డి లెక్కలు వేరేలా ఉన్నాయి. హనుమాన్ తీస్తున్నప్పుడు అందరూ దాన్ని ఓ మామూలు సినిమా అనుకున్నారు కానీ రిజల్ట్ చూశాక అందరి మతి పోయింది. కంటెంట్ బావుంటే ఆ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరథం పడతారనే గ్యారెంటీతో నిర్మాత ఇంత పెద్ద మొత్తం ఖర్చు పెట్టడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. రోహిత్ అనే డైరెక్టర్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఈ సినిమా కోసమే తేజు గత కొన్ని నెలలుగా మేకోవర్ చేస్తున్నాడు.