ASBL Koncept Ambience
facebook whatsapp X

భారత సంతతి రచయితకు సింగపూర్‌ లిటరేచర్‌ అవార్డు

భారత సంతతి రచయితకు సింగపూర్‌ లిటరేచర్‌ అవార్డు

భారత సంతతి అధ్యాపకురాలు ప్రశాంతీ రామ్‌ (32)కు ప్రతిష్ఠాత్మక సింగపూర్‌ లిటరేచర్‌ అవార్డు లభించింది. 2023లో ఆమె రాసిన నైన్‌ యార్డ్‌ శారీస్‌ అనే ఆంగ్ల కాల్పనిక కథానికకు ఈ అవార్డు లభించింది. తరతరాలుగా సింగపూర్‌, సిడ్నీ, న్యూయార్క్‌, కనెక్టికట్‌లలో విస్తరించిన ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబం నేపథ్యంలో ఈ కథనం సాగుతుంది. ఈ అవార్డు వచ్చినదని తెలిసినప్పుడు షాక్‌కు గురయ్యానని నానీ యాంగ్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీలో అధ్యాపకురాలుగా పనిచేస్తున్న ప్రశాంతి సంతోషం వ్యక్తం చేశారు. విక్టోరియా థియేటర్‌లో జరిగిన పురస్కార ప్రదాన కార్యక్రమంలో కవి సిరిల్‌ వాంగ్‌ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ప్యానల్‌ ప్రశాంతిపై  ప్రశంసల జల్లు కురిపించింది. మహిళలు ఒకరినొకరు ఎలా ఇబ్బందులు పెట్టుకుంటారో, కుటుంబాల్లోని పురుషులను ఎలా సమస్యలకు గురిచేస్తారో ఆమె చక్కగా వివరించారు అని పేర్కొన్నారు.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :