కేంద్ర బడ్జెట్లో తెలంగాణ అనే పదాన్నే నిషేధించారు : సీఎం రేవంత్
కేంద్రం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ 2047 బడ్జెట్లో తెలంగాణ పట్ల వివక్ష ప్రదర్శించారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర బడ్జెట్పై ఆయన స్పందిస్తూ బడ్జెట్లో తెలంగాణ అనే పదాన్నే నిషేధించారని మండిపడ్డారు. మా ప్రభుత్వంలోని మంత్రులు 18 సార్లు ఢల్లీికి వెళ్లారు. తెలంగాణకు అవసరమైన నిధులు ఇవ్వాలని స్వయంగా నేను ప్రధానికి విజ్ఞప్తి చేశా. కానీ, తెలంగాణ పదం పలకడానికి కేంద్రం ఇష్టపడటం లేదు. మొదటి నుంచి ప్రధాని మోదీ తెలంగాణ పల్ల కక్ష కట్టారు. ఇప్పటి వరకు ఆర్ఆర్ఆర్కు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఏ రంగానికి సహకారం అందించలేదు. వికసిత్ భారత్లో తెలంగాణ భాగం కాదని ప్రధాని అనుకుంటున్నారు అని విమర్శించారు.
Tags :