ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్గా మహేష్చంద్ర లడ్డా
![ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్గా మహేష్చంద్ర లడ్డా](https://www.telugutimes.net/storage/news/news_new_75391.jpg)
కేంద్ర సర్వీసుల్లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ చంద్ర లడ్డాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిఘా విభాగం అధిపతిగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. 1998 బ్యాచ్కు చెందిన మహేష్చంద్ర లడ్డా ప్రస్తుతం సీఆర్పీఎఫ్లో ఐజీగా కొనసాగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు డిప్యూటేషన్ మీద ఉన్న ఆయన్ను రాష్ట్రానికి పంపేందుకు కేంద్రం అనుమతించింది. దీంతో ఆయన సీఆర్పీఎఫ్ నుంచి రిలీవ్ అయి రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న కుమార్ విశ్వజిత్ను బదిలీ చేస్తూ ఆయన స్థానంలో లడ్డాను ప్రభుత్వం నియమించింది.
![praneet](/storage/article-ads/radha-county.jpg)
![praneet](/storage/article-ads/loft.jpeg)
![praneet](/storage/article-ads/praneet-ads.jpg)
![obili-garuda](/storage/article-ads/obili-garuda-ads.jpg)
![Vertex](/storage/article-ads/vertex.jpeg)
![poulomi](/storage/article-ads/poulomi-ads.jpg)
![Png-jewelry](/storage/article-ads/png-jewelry-ads.jpg)
Tags :