ASBL NSL Infratech
facebook whatsapp X

తెలంగాణలో ఐపీఎస్‌ అధికారులు బదిలీ... ఉత్తర్వులు జారీ

తెలంగాణలో ఐపీఎస్‌  అధికారులు బదిలీ... ఉత్తర్వులు జారీ

తెలంగాణ రాష్ట్రంలో 15 మంది ఐపీఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శాంతిభద్రతల అదనపు డీజీపీగా మహేశ్‌ భగవత్‌ , హోంగార్డుల, ఆర్గనైజేషన్‌ అదనపు డీజీగా స్వాతి లక్రా, గ్రేహౌండ్స్‌ ఏడీజీగా స్టీఫెన్‌ రవీంద్ర, పోలీస్‌ పర్సనల్‌ అదనపు డీజీగా విజయ్‌ కుమార్‌ ( పోలీసు సంక్షేమం, క్రీడల అదనపు బాధ్యతలు), టీజీఎస్పీ బెటాలియన్ల అదనపు డీజీగా సంజయ్‌ కుమార్‌, రాచకొండ పోలీస్‌ కమిషనర్‌గా సుధీర్‌ బాబు, ఏసీబీ డైరెక్టర్‌గా తరుణ్‌ జోషి,  మల్టీజోన్‌-1 ఐజీగా ఎస్‌.చంద్రశేఖర్‌ రెడ్డి, రైల్వే, రోడ్‌ సేఫ్టీ ఐజీగా కె.రమేశ్‌ నాయుడు, మెదక్‌ ఎస్పీగా ఉదయ్‌ కుమార్‌ రెడ్డి, వనపర్తి ఎస్పీగా ఆర్‌.గిరిధర్‌, హైదరాబాద్‌ తూర్పు మండలం డీసీపీగా జి.బాలస్వామి, హైదరాబాద్‌ పశ్చిమ మండలం డీసీపీగా జి.చంద్రమోహన్‌, సీఏఆర్‌హెడ్‌ క్వాటర్స్‌ డీసీపీగా రక్షితమూర్తిని  నియమిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. 
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye
Tags :