మట్కా బయోపిక్కా?
వరుణ్ తేజ్ హీరోగా కరుణ కుమార్ దర్శకత్వలో పీరియాడిక్ జానర్ లో తెరకెక్కుతున్న సినిమా మట్కా. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 1958-1982 మధ్య కాలంలో జరిగిన కథగా ఈ సినిమా రూపొందుతోంది. మట్కాలో వరుణ్ పాత్ర మూడు వేరియేషన్స్ లో ఉంటుంది. సాధారణ గ్యాంబ్లర్ నుంచి మట్కా కింగ్ గా ఇంటర్నేషనల్ లెవెల్ కు ఎదిగే వరకు అతని జర్నీని మట్కాలో చూపించనున్నాడు డైరెక్టర్ కరుణ కుమార్.
మట్కా అంటే ఇదో రకమైన జూదం. చాలా తక్కువ మందికే ఇందులో టాలెంట్ ఉంటుంది. ఒకప్పుడు దీనికోసం స్పెషల్ గా క్లబ్లు ఉండేవి. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట ప్రచారమవుతుంది. ఈ సినిమా ఓ వ్యక్తి బయోపిక్ గా రూపొందుతుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
విశాఖలో దొండపర్తి ప్రాంతంలో ఒకప్పుడు వెలుగు వెలిగిన మట్కా కింగ్ జీవిత కథ ఆధారంగా మట్కాను తెరకెక్కిస్తున్నారని, ఒరిజినల్ కథను తీసుకుని దానికి డైరెక్టర్ కరుణ్ కుమార్ తనదైన ఫిక్షనల్ స్క్రీన్ ప్లే ను యాడ్ చేసి దీన్ని పాన్ ఇండియా సినిమాగా మలుస్తున్నాడని సమాచారం. ఇందులో నిజమెంతున్నది తెలియాలంటే చిత్ర యూనిట్ స్పందించాల్సిందే. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో నవీన్ చంద్ర నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.