జై హనుమాన్ హీరో ఫిక్సయ్యాడా?
ఈ ఏడాది రిలీజైన హిట్ సినిమాల్లో ఒకటైన హనుమాన్(Hanu man) సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్(Jai Hanuman) ను ప్రకటించినప్పటికీ ఇంకా దాన్ని మొదలుపెట్టింది లేదు. ఫస్ట్ పార్ట్ లో హనుమంతుడిని గ్రాఫిక్స్ లో చూపించిన ప్రశాంత్ వర్మ(Prasanth Varma) ఈసారి సీక్వెల్ ను భారీ కాన్వాస్ లో తీయబోతున్నాడు. హనుమంతుడి పాత్రను ఎవరైనా పెద్ద హీరోతో చేయించాలని ప్రశాంత్ వర్మ చూస్తున్నాడు.
అందులో భాగంగానే మొదట చిరంజీవి(chiranjeevi), రామ్ చరణ్(ram charan) పేర్లు వినిపించాయి కానీ అవి పుకార్లని తేలిపోయింది. తాజా సమాచారం ప్రకారం ఆ పాత్ర కోసం కాంతార(kanthara) ఫేమ్ రిషబ్ శెట్టి(rishab Shetty)ని ఫిక్స్ చేసినట్లు శాండిల్ వుడ్ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం కాంతార2(kanthara2)తో బిజీగా ఉన్న రిషబ్ ఫ్రీ అవాలంటే మరో ఆరేడు నెలలు పడుతుంది.
ఈలోపు జై హనుమాన్ స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ తో పాటూ మోక్షజ్ఞ(mokshagna) డెబ్యూని కూడా పూర్తి చేయాలని చూస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ఇప్పటికే ప్రశాంత్ వర్మ, రిషబ్ శెట్టికి కథ వినిపించాడని, రిషబ్ సానుకూలంగా స్పందించాడని ఇన్సైడ్ టాక్. అయితే ఈ సినిమాను ప్రైమ్ షో(prime Show) కాకుండా మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers) భారీ బడ్జెట్ తో నిర్మించనుందని సమాచారం. ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కాబట్టి కచ్ఛితంగా చెప్పలేం కానీ ఈ వార్త మాత్రం గట్టిగానే వినిపిస్తోంది.