జగన్ తిరుమల ట్రిప్ క్యాన్సిల్.. దీని వెనుక డిక్లరేషన్ కారణమా లేక ఇంకేదైనా ఉందా?
వైసిపి (YCP) అధినేత ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (Jagan) తిరుమల శ్రీవారి దర్శనం ఎంత వివాదాస్పదంగా మారిందో అందరికీ తెలుసు. ఆయన ప్రభుత్వ హయాంలో శ్రీవారి ప్రసాదమైన తిరుమల లడ్డు (Tirumala Laddu) తయారీలో జంతువుల నూనెలు, కొవ్వులు కలిసాయి అంటూ అధికార పార్టీ లేవనెత్తిన అభియోగం తీవ్ర ధమారంగా చెలరేగుతుంది. ఈ నేపథ్యంలో తన తప్పులేదు అంటూ శ్రీవారిని సందర్శించడానికి జగన్ ఫిక్స్ అయ్యారు.
సెప్టెంబర్ 27 సాయంత్రం నాలుగు గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి తిరుమలకు చేరుకోవాల్సి ఉన్న జగన్ తన ప్రయాణాన్ని విరమించుకున్నారు. జగన్ తిరుమల ( Jagan Tirumala). దర్శనానికి ముందు డిక్లరేషన్ ఇవ్వవలసిందిగా బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి (Purandeswari) తో పాటు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandra Babu) తదితరులు పేర్కొన్నారు. ఇటు టీటీడీ అధికారులు కూడా జగన్ దగ్గర డిక్లరేషన్ తీసుకోవడానికి ఫిక్స్ అయ్యారు..
తిరుమలలో అన్యమతస్తులు ఎవరైనా దేవస్థానానికి వచ్చే సమయంలో అధికారులు తప్పనిసరిగా వారి నుంచి డిక్లరేషన్ను తీసుకోవడం అనవాయతి. ఇదేమంత పెద్ద కష్టమైన పని కాదు.. నాకు వెంకటేశ్వర స్వామి పై పూర్తి నమ్మకం ఉంది అంటూ ఓ చిన్న సంతకం పెట్టడమే. అయితే జగన్ దీనికి ఎందుకు వెనకాడుతున్నారు అన్న విషయం ఎవరికీ తెలియడం లేదు. అయితే అందరూ భావిస్తున్నట్లుగా జగన్ తిరుమల ప్రయాణం క్యాన్సల్ చేసుకోవడం వెనక డిక్లరేషన్ ఒక్కటే కారణం కాదు. జగన్ తిరుమల వస్తున్నారు అన్న విషయం తెలిసిన వెంటనే సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 24 వరకు తిరుపతిలో ఎటువంటి సభలు, సమావేశాలు, ఊరేగింపులు పొలిటికల్ ర్యాలీల వంటివి నిర్వహించడానికి లేదు అంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. అంతేకాదు నిబంధనలు దాటిన వారికి కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేశారు.
ఇప్పటికే జగన్ ని అన్ని విధాల బుక్ చేసిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు తిరుమల ప్రయాణాన్ని అడ్డుపెట్టుకొని జగన్ విషయంలో ఏదన్నా తిరకాసు చేస్తే.. ఇక జగన్ పని అంతే. జగన్ ప్రోగ్రామ్ సడన్ గా క్యాన్సిల్ అవ్వడానికి వెనుక బలమైన కారణం ఇదే అయ్యి ఉండొచ్చు అన్ని కొందరు భావిస్తున్నారు. అయితే జగన్ మాత్రం అనవసరమైన వివాదాలకు, గొడవలకు తావివ్వకూడదు అనే ఉద్దేశంతో తన ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకున్నాను అని చెబుతున్నారు. లోగోట్టు పెరుమాళ్ళకి ఎరుక అన్నట్టు అసలు విషయం జగన్ కి మాత్రమే తెలియాలి.