ఏపీకి రండి... పెట్టుబడులు పెట్టండి
![ఏపీకి రండి... పెట్టుబడులు పెట్టండి](https://www.telugutimes.net/storage/news/news_new_75227.jpg)
ఆంధ్రప్రదేశ్కు విచ్చేసి కాబోయే ప్రపంచ స్థాయి నగరం అమరావతిని సందర్శించండి. ఇక్కడ పెట్టుబడులు పెట్టండి అంటూ అఖిల భారత పంచాయతీ పరిషత్ (న్యూ ఢిల్లీ ) జాతీయ ఉపాధ్యక్షుడు, అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ జాస్తి వీరాంజనేయులు, నేపాల్ వేదికగా పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు. నేపాల్ రాజధాని ఖాఠ్మండులో పర్యటించిన ఆయన అమరావతిలో పెట్టుబడులకు ముందుకు రావాలని కోరుతూ ఫెక్సీలు ప్రదర్శించారు. యూనెస్కో గుర్తించిన పశుపతినాథ్ దేవాలయం, గుహేశ్వర పార్వతీమాత దేవాలయం, బౌద్ధ స్థూపం, స్వయంభు, బౌద్ధ నీలకంఠ వంటి ప్రఖ్యాత ప్రదేశాలలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతిలోని ప్రపంచంలోనే మేటి నగరంగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు విస్తృత ప్రమాళికలు రచిస్తున్నారన్నారు.
![praneet](/storage/article-ads/radha-county.jpg)
![praneet](/storage/article-ads/loft.jpeg)
![praneet](/storage/article-ads/praneet-ads.jpg)
![obili-garuda](/storage/article-ads/obili-garuda-ads.jpg)
![Vertex](/storage/article-ads/vertex.jpeg)
![poulomi](/storage/article-ads/poulomi-ads.jpg)
![Png-jewelry](/storage/article-ads/png-jewelry-ads.jpg)
Tags :