కరీనాకు బాలయ్య లాంటి అరుదైన గౌరవం
నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా రీసెంట్ గా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఘనంగా సిల్వర్ జూబ్లీ వేడుకలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఏ హీరోకీ ఇలాంటి గౌరవం దక్కలేదు. బాలకృష్ణ బాల నటుడిగానే సినీ జర్నీ మొదలుపెట్టడంతో ఇది సాధ్యమైంది.
తాజాగా బాలీవుడ్ నటి కరీనా కపూర్ కూడా ఇలాంటి అరుదైన గౌరవాన్నే అందుకుంది. కరీనా ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆమె పేరిట బాలీవుడ్ పరిశ్రమ చిత్రోత్సవాన్ని నిర్వహిస్తుంది. గతంలో ఈ గౌరవం దిలీప్ కుమార్, అమితాబ్ బచ్చన్ కు మాత్రమే దక్కగా, ఓ నటిగా కరీనా మాత్రమే ఈ గౌరవం అందుకుంది.
ఈ చిత్రోత్సవంలో భాగంగా కరీనా కెరీర్లో గొప్పగా నిలిచిన సినిమాల్ని స్పెషల్ స్క్రీనింగ్ చేయనున్నారట. తన జనరేషన్ హీరోయిన్లు బాలీవుడ్ లో ఎంతోమంది ఉన్నప్పటికీ వారెవరికీ దక్కని ఈ అరుదైన ఘనత కరీనా సొంతం చేసుకుంది. రీసెంట్ గా కరీనా నిర్మాతగా కూడా మారింది. ముందు ముందు అమ్మడి నుంచి మరిన్ని మంచి సినిమాలు రావాలని కోరుకుందాం.