స్పిరిట్ లో బాలీవుడ్ స్టార్ జంట?
దేవర పార్ట్1 కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటూ అందులో విలన్ గా నటించిన సైఫ్ అలీ ఖాన్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. దేవర తన కెరీర్లో పెద్ద బ్రేక్ అవుతుందని ఆయన నమ్ముతున్నాడు. ఇదిలా ఉంటే ప్రభాస్- సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రానున్న స్పిరిట్ లో విలన్ గా సైఫ్ అలీ ఖాన్ ను సంప్రదించినట్లు లేటెస్ట్ అప్డేట్.
యానిమల్ లో బాబీ డియోల్ పాత్రకు మించి స్పిరిట్ లో విలన్ పాత్రను డిజైన్ చేశాడట సందీప్ రెడ్డి వంగా. అంతేకాదు ప్రభాస్ పోషించిన పోలీసాఫీసర్ పాత్రని కవ్వించేలా వయొలెంట్ భార్యాభర్తల పాత్రలుంటాయని, కుదిరితే కరీనా కపూర్నే సైఫ్ కు జోడీగా తీసుకోవాలని ట్రై చేస్తున్నారట. ప్రస్తుతానికైతే ఇది రూమర్ల దశలోనే ఉంది.
ఇది ఎంతవరకు నిజమా అని చెప్పలేం కానీ ఓ సౌత్ పాన్ ఇండియా సినిమాకు కరీనా కపూర్ సైన్ చేసిన మాటైతే నిజమే. అది మహేష్ బాబు- రాజమౌళి సినిమానా లేక ప్రభాస్ స్పిరిట్ సినిమానా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రాజా సాబ్, ఫౌజి సినిమాలు చేస్తున్న ప్రభాస్ ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ చేయనున్నాడని సమాచారం.