ఖైరతాబాద్ గణేశునికి 75 అడుగుల కండువా
ఖైరతాబాద్ గణేశుని ప్రతి ఏడాది విధంగానే సాంప్రదాయం, ఆచారంలో భాగంగా ఈ ఏడాది కూడా వినాయక చవితి పర్వదిన సందర్భంగా ఖైరతాబాద్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గణనాథునికి 75 అడుగుల జంధ్యం, 76 అడుగుల కండువా, 75 అడుగుల గజమాల సమర్పించనున్నట్లు ఖైరతాబాద్ పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు గుర్రం కొండయ్య, అధ్యక్షులు కడారి శ్రీధర్, ప్రధాన కార్యదర్శి ఏలే స్వామి లు తెలిపారు. వినాయక చవితి రోజున భారీ ఊరేగింపుతో 75 అడుగుల కండువాను 75 అడుగుల జంధ్యాన్ని 75 అడుగుల గరికమాలను దేవుళ్ళకి పట్టువస్త్రాలు సమర్పిస్తామని తెలిపారు. ఖైరతాబాద్ గణనాథునికి సమర్పించిన భారీ చేనేత కండువా, సంధ్యం ను మీడియా ప్రతినిధుల సమక్షంలో ప్రదర్శించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ వినాయక చవితి రోజు రాజ్ దూత్ హోటల్ చౌరస్తా నుండి గుర్రపు బగ్గిలో పట్టు వస్త్రాలు ఊరేగించి ఊరేగింపుతో ఉగ్గు డోలు, గుస్సాడి నృత్యం, కోలాటం సాంస్కృతిక ప్రదర్శనతో వందలాంది మంది ఖైరతాబాద్ గణేష్ భక్తుల పద్మశాలి బంధువులతో వెళ్లి జంధ్యం, కండువా, గరిక మాల సమర్పించనున్నట్లు తెలిపారు.