వైసీపీకి ఎదురుదెబ్బ.. మాజీ ఎమ్మెల్యే రోశయ్య రాజీనామా
గుంటూరు జిల్లాలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య రాజీనామా చేశారు. గుంటూరులో తన అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా రోశయ్య మీడియాతో మాట్లాడుతూ వైసీపీ కొందరు వ్యక్తుల చేతుల్లోనే నడుస్తోంది. కష్టపడిన వారికి పార్టీలో గుర్తింపు ఉండదు. ఉమ్మారెడ్డి అనుభవాన్ని వినియోగించుకోలేదు. మండలిలో ప్రతిపక్ష నేత విషయంలో కనీసం చర్చించలేదు. మండలిలో చైర్మన్ ఉన్నారు. ప్రతిపక్ష నేతగా కూడా ఉమ్మారెడ్డికి అవకాశం ఇవ్వలేదు. గుంటూరు నుంచి ఎంపీ అభ్యర్థిగా నన్ను నిలబెట్టారు. కొందరు మానసికంగా కుంగదీశారు. ఎన్నికల తర్వాత కూడా వారి ఇష్టాలతోనే పార్టీని నడుపుతున్నారు. వైసీపీలో నేను కొనసాగలేను అని స్పష్టం చేశారు.
Tags :