వైసీపీ పాపానికి విజయవాడ మునిగింది : మంత్రి కొల్లు
వైసీపీ చేసిన పాపానికి విజయవాడ మునిగిపోయిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసి నేటికి సరిగ్గా ఏడాది అయ్యిందని అన్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేస్తే, ప్రజలు కన్నీళ్లు పెట్టుకున్నారని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రజల కన్నీళ్లు చూడకూడదని చంద్రబాబు కష్టపడుతున్నారని తెలిపారు. నాడు ప్రజల తరపున పోరాడుతూ బస్సులో ఉన్నారు. ప్రజల కన్నీళ్లు తుడవడానికి ఇప్పుడూ బస్సులోనే ఉన్నారు. బుడమేరు కట్ట మీద మట్టి దోచుకెళ్లారు. పడవలు తెచ్చి ప్రకాశం బ్యారేజీని దెబ్బతీసే ప్రయత్నం చేశారు. 9 రోజులుగా చంద్రబాబు కలెక్టరేట్లోనే ఉండి, కేంద్ర మంత్రులను పిలిపించుకుని వరద కష్టాలు, నష్టాలు వారికి వివరించారు అని అన్నారు.
Tags :