నాలుగు వారాల తర్వాత వారి పదవులు ఊడటం ఖాయం
పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కాంగ్రెస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టులాంటిదని వ్యాఖ్యానించారు. నాలుగు వారాల తర్వాత దానం నాగేందర్, కడియ శ్రీహరి, తెల్లం వెంకట్రావుల ఎమ్మెల్యే పదవులు ఊడటం ఖాయమన్నారు. పార్టీ మారిన అన్ని నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవని, మొదటి నుంచి ఇదే విషయాన్ని చెబుతున్నామని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ అంటూనే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. న్యాయస్థానాల్లో ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి శిక్ష తప్పదని అన్నారు.
Tags :