పోటీని లెక్క చేయని కుబేర
తమిళ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున కలయికలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కుబేర. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ధనుష్ క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉండనుందని మొదటి నుంచి అంటున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకుంటన్నారు. రిలీజ్ డేట్ ను ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. అయితే డిసెంబర్ 6న పుష్ప2 వస్తుంది కాబట్టి ఆ రోజున ఈ సినిమాను రిలీజ్ చేస్తే పుష్ప2 హైప్ లో ఈ సినిమాను పట్టించుకోరు. ఇక డిసెంబర్ 20న క్రిస్మస్ సీజన్ లో గేమ్ ఛేంజర్ రిలీజయ్యే అవకాశాలున్నాయి.
కుబేర కోసం డిసెంబర్ 20ని ఫిక్స్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది. పుష్ప2 తో పోలిస్తే గేమ్ ఛేంజర్ కు కాస్త బజ్ తక్కువే ఉంది. శేఖర్ కమ్ముల సినిమాలకు ఎలాగూ ఫ్యామిలీ ఆడియన్స్ బేస్ ఉంటుంది. యూత్ లో కూడా ఆయనకు ఓ రకమైన క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో గేమ్ ఛేంజర్ కు పోటీగా కుబేరను రిలీజ్ చేసినా పెద్దగా సమస్య ఉండకపోవచ్చని సినీ విశ్లేషకులంటున్నారు. మరి కుబేర టీమ్ ఆఖరికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.