డబుల్ ఇస్మార్ట్ కు స్పీడ్ బ్రేకర్ లా లైగర్ వివాదం
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ కలయికలో వస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆగస్ట్ 15న రిలీజ్ కానున్న ఈ సినిమా ఆడియన్స్ కు డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని మేకర్స్ ఎంతో నమ్మకంగా చెప్తున్నారు. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో థియేట్రికల్ రైట్స్ ను సేల్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు.
నార్త్ కాకుండా మిగిలిన అన్ని ఏరియాలు కలిపి మేకర్స్ రూ.63 కోట్లు డిమండ్ చేస్తున్నారట. కానీ భారీ అంచనాల మధ్య వచ్చిన పూరీ చివరి సినిమా లైగర్ తీవ్రంగా నిరాశపరిచి పెద్ద ఎత్తున నష్టాలను మిగిల్చింది. ఆ టైమ్ లో పెద్ద వివాదమే అయింది. తర్వాత లైగర్ విషయంలో అందరూ సైలెంట్ గా ఉన్నా ఇప్పటికీ ఆ లెక్కలు తేలలేదు. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కు రెడీ అయిన నేపథ్యంలో మళ్లీ లైగర్ వివాదం బయటకొస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. చూస్తుంటే డబుల్ ఇస్మార్ట్ బిజినెస్ కు లైగర్ వివాదం స్పీడ్ బ్రేకర్ లా మారేట్లుంది. ప్రస్తుతం ఈ విషయంపై డిస్కషన్స్ జరుగుతున్నాయని సమాచారం. రిలీజ్ కు ముందే ఇవన్నీ క్లియర్ చేస్తుంటే ఎలాంటి టెన్షన్ ఉండదు.