తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు. పీసీసీ అధ్యక్ష పదవి కోసం ప్రచార కమిటీ చైర్మన్ మధుయాస్కీగౌడ్, ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్లతో పాటు మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పోటీ పడినప్పటికీ అధిష్ఠానం ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ వైపే మొగ్గు చూపింది. పీసీసీ అధ్యక్షుడిగా జులై 7వ తేదీతో రేవంత్ రెడ్డి పదవీకాలం పూర్తయింది. అప్పటి నుంచి కొత్త అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు జరుగుతుండగా, నేడు అధికారిక ప్రకటన వెలువడిరది.
Tags :