ASBL Koncept Ambience
facebook whatsapp X

అలాంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు : మహేశ్‌కుమార్‌ గౌడ్‌

అలాంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు  : మహేశ్‌కుమార్‌ గౌడ్‌

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఎక్కడున్నారో కేటీఆర్‌ చెప్పాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ డిమాండ్‌ చేశారు. గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌, ఆ పార్టీ నేతల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 800 చెరువులను కబ్జా చేశారు. కబ్జా చేశారు కాబట్టే ఆ పార్టీ నేతలు భయపడుతున్నారు. రాహుల్‌ గాంధీకి, హైడ్రాకు ఏంటి సంబంధం? ఇంకా డీపీఆర్‌ రూపొందించలేదు. అలాంటప్పుడు అవినీతి ఎలా జరుగుతుంది? మూసీ ప్రక్షాళన చేసి ఆదుకుంటామని గతంలో కేసీఆరే అన్నారు. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌లోని నిర్మాణాలనే హైడ్రా కూల్చుతోంది. హైడ్రా, కూల్చివేతలపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అలాంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. హైదరాబాద్‌లో చెరువులకు పూర్వ వైభవం తీసుకొస్తాం అని వెల్లడిరచారు.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :