ఈ వయసులో ఆ స్పీడేంటి మణి సార్?
స్టార్ డైరెక్టర్లంతా ఇప్పుడు తమ సినిమాలను పాన్ ఇండియా పేరుతో ఏళ్లకు ఏళ్లు తీసేస్తున్నారు. వీటి వల్ల హీరోలు ఒకే సినిమా కోసం ఏళ్ల తరబడి సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది. కానీ మణిరత్నం(Mani Ratnam) మాత్రం వయసు మళ్లాక కూడా ఎంతో ఫాస్ట్ గా సినిమాలను పూర్తి చేసేస్తున్నాడు. కమల్ హాసన్(Kamal Hassan) తో థగ్ లైఫ్(Thug Life) సినిమా షూటింగ్ ను ఎంతో వేగంగా పూర్తి చేసి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నాడు.
2025 సమ్మర్ లో థగ్ లైఫ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా మణిరత్నం, సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) కు ఓ కథ చెప్పారని కోలీవుడ్ టాక్. గతంలో దళపతి(Dalapathi) లాంటి క్లాసిక్ తర్వాత వీరిద్దరి కాంబో మళ్లీ ఇప్పటివరకు సాధ్యపడలేదు. ఫ్యాన్స్ ఎంతో ఎదురుచూసినప్పటికీ నిరాశే మిగిలింది. ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్లకు వారి ఆశ చిగురించేలా ఉంది.
ప్రస్తుతం లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో కూలీ(Coolie) సినిమా చేస్తున్న రజినీకాంత్, ఆ తర్వాత జైలర్2(Jailer) చేయాల్సి ఉంది. ఒకవేళ మణిరత్నం కనుక తక్కువ టైమ్ లోనే సినిమా పూర్తి చేస్తానని మాటిస్తే రజినీ లైనప్ మారే ఛాన్సుంది. రాజకీయ నేపథ్యంలో యువ తరహాలో ఆలోచింపచేసేలా మణిరత్నం ఓ కాన్సెప్ట్ తీసుకున్నారని, ఇంకా అది ఫైనల్ షేప్ కు రాలేదని కోలీవుడ్ వర్గాలంటున్నాయి. ఏదేమైనా స్క్రిప్ట్, సినిమాలను పూర్తి చేసే విషయంలో ఈ సీనియర్ డైరెక్టర్ ను నేటి స్టార్ డైరెక్టర్లు ఆదర్శంగా తీసుకుని సినిమాలను త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.