నారా లోకేష్ అమెరికా పర్యటన విశేషాలు..
ఆంధ్ర రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ అమెరికా పర్యటన లో కార్య క్రమాలు పూర్తిగా ఖరారు కాక పోయినా, ఇప్పటి వరకు నిర్ణయించిన వాటి వివరాలు ఇస్తున్నాం.
మొదట గా శ్రీ లోకేష్ నారా 25 అక్టోబర్ తేదిన శాన్ ఫ్రాన్సిస్కో చేరుకొని, రెండు రోజులు కాలిఫోర్నియా రాష్ట్రం లో కొన్ని ముఖ్య మైన కంపెనీ విజిట్స్, సీఈఓ మీటింగ్ లలో పాల్గొంటారని తెలిసింది. టెక్సాస్ రాష్ట్రం లో ఆస్టిన్ నగరం లో కూడా ఒక మీటింగ్ వున్నట్టు తెలిసింది.
29 అక్టోబర్ న లాస్ వెగాస్ లో ఐటీ సర్వ్ వారు ప్రతిష్టాత్మకం గా నిర్వహిస్తున్న సినర్జీ 2024 కాన్ఫరెన్స్ లో శ్రీ లోకేష్ ముఖ్య అతిథి గా పాల్గొంటారు.
అట్లాంటా లో 31 అక్టోబర్ తేదిన తెలుగుదేశం ఎంఎల్ఏ, ఎన్ఆర్ఐ శ్రీ రాము వెనిగేళ్ల నిర్వహణ లో అట్లాంటా ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొంటారు. ఆ తరువాత న్యూ జెర్సీ, వర్జీనియా లలో జరిగే అఫిషియల్ మీటింగ్స్ లో పాల్గొని, నవంబర్ 1 న తిరిగి ఇండియా తిరిగి వెళతారు.