విజయవాడ మెట్రోను అమరావతికి : మంత్రి నారాయణ
కేంద్రమంత్రి మనోహర్లాల్ ఖట్టర్తో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్శాఖ మంత్రి నారాయణ ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులపై కీలకంగా చర్చించారు. విశాఖ, విజయవాడ మెట్రోపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. విజయవాడ మెట్రోను అమరావతికి అనుసంధానం చేయాలని మంత్రి నారాయణ ప్రతిపాదించారు. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రతిపాదనలు పంపినట్లు కేంద్రమంత్రి ఖట్టర్ దృష్టికి తెచ్చారు. అమృత్ పథకంపై అమలుపై కూడా కీలక చర్చ జరిగింది. మెట్రో ప్రాజెక్టులపై తదుపరి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఖట్టర్ చెప్పినట్టు సమాచారం.
Tags :