త్వరలో ఆపరేషన్ బుడమేరు : మంత్రి నారాయణ
త్వరలో ఆపరేషన్ బుడమేరు చేపడతామని సీఎం చంద్రబాబు చెప్పారని మంత్రి నారాయణ తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బుడమేరులో ఆక్రమణలు తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వరద బాధితులకు ఆహారం, తాగునీరు పంపిణీలో ఇబ్బంది లేకుండా చూశామని తెలిపారు. పారిశుద్ధ్యం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. బాధితులు పూర్తిగా కోలుకునే వరకు ఆహారం అందించాలని సీఎం ఆదేశించారని తెలిపారు. ఇప్పటి వరకు 77 వేల విద్యుత్ కనెక్షన్లు పునరుద్ధరించాం. వరద ప్రాంతాల్లోని నీటిని మరో రెండ్రోజులు తాగొద్దని ప్రజలకు సూచించాం అని తెలిపారు.
Tags :