జీరో ఎంపీ సీట్లు ఇచ్చినా.. ఆ పార్టీ వైఖరి మారలేదు : మంత్రి శ్రీధర్బాబు
శాసనసభ నియమాల ప్రకారమే పీఏసీ చైర్మన్ను స్పీకర్ నియమించారని తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సీఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేను అని పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ చెప్పారు. బీఆర్ఎస్ నేతలతో పీఏసీ చైర్మన్కు అభిప్రాయభేదాలు ఉంటే మాకేం సంబంధం? ప్రభుత్వాన్ని నడపాలని ప్రజలు మాకు తీర్పు ఇచ్చారు. ఫలితాల తర్వాత కూడా ఏదో జరుగుతుందని బీఆర్ఎస్ నేతలు కొన్ని రోజులు తిరిగారు. అంత తిరిగిన తర్వాత కూడా ప్రజలు మరోసారి తీర్పు ఇచ్చారు. బీఆర్ఎస్ వైఖరి మారలేదని చెప్పి, లోక్సభ ఎన్నికల్లో జీరో తీర్పు ఇచ్చారు. జీరో ఎంపీ సీట్లు ఇచ్చినా కూడా ఆ పార్టీ వైఖరి మారలేదు. రాజ్యాంగ స్ఫూర్తి గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్కు లేదు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నేతలు వ్యవస్థలను గౌరవించాలి అని సూచించారు.