మలేసియా పర్యటనకు మంత్రి తుమ్మల
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మలేసియా పర్యటనకు వెళ్లారు. ఆయిల్ పామ్ సాగు విధానం, నూనె గింజల ఉత్పత్తి, నూనె ఉత్పత్తి తదితర అంశాలపై అధ్యయనం చేయటానికి ఆయన మలేసియా బయలుదేరి వెళ్లారు. మూడు రోజులపాటు అక్కడ పర్యటించనున్నారు. ఉద్యానశాఖ ద్వారా రాష్ట్రంలో అమలు చేస్తున్న ఆయిల్ పామ్ ప్రాజెక్టును మరింత విజయవంతం చేయటానికి తీసుకోవలసిన చర్యలపై ఆయన అధ్యయనం చేయనున్నారు. ఆయనతో పాటు ఈ పర్యటనలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఉద్యాన కమిషనర్ యాస్మిన్ బాషా, అధికారులు సరోజిని, ఓఎస్డీ శ్రీధర్ తదితరులు పాల్గొంటున్నారు.
Tags :