ASBL NSL Infratech

టీడీపీ హయాంలో ఏపీ అభివృద్ధి : ఎంపీ బైరెడ్డి శబరి

టీడీపీ హయాంలో ఏపీ అభివృద్ధి :  ఎంపీ బైరెడ్డి శబరి

వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్‌కు ఒక్క ఐటీ కంపెనీ కూడా రాలేదని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి విమర్శించారు. లోక్‌సభలో ఆమె తొలిసారి మాట్లాడారు. హైదరాబాద్‌ ప్రగతిలో చంద్రబాబు ముద్ర ఉంది. టీడీపీ హయాంలో ఏపీ బాగా అభివృద్ధి చెందింది. వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యం. అందుకే ఆంధ్రప్రదేశ్‌ ఇవాళ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రాజధాని అమరావతికి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. వైసీపీ అధికారంలోకి రాగానే మూడు రాజధానులని మాట మార్చింది. మూడు రాజధానుల పేరుతో కాలయాపన చేస్తూ ఎక్కడా ఒక్క ఇటుక పేర్చలేదు. టీడీపీ హయాంలో పోలవరం నిర్మాణం 70 శాతం పూర్తయితే వైసీపీ ప్రభుత్వం ఒక్క శాతం పనులు కూడా చేయలేకపోయింది. కేంద్రం ఇచ్చిన రూ.వేల కోట్ల నిధులను పక్కదారి పట్టించింది.  అధికారాన్ని అడ్డు పెట్టుకుని లిక్కర్‌, ల్యాండ్‌, శాండ్‌ మాఫీయాను ఆ పార్టీ నడిపించింది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నా అని శబరి విజ్ఞప్తి చేశారు. 
 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :