ASBL Koncept Ambience
facebook whatsapp X

మంత్రి కొండా సురేఖపై ..ట్రోలింగ్‌ చేసింది వారే

మంత్రి కొండా సురేఖపై ..ట్రోలింగ్‌ చేసింది వారే

మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్‌ చేసింది బీఆర్‌ఎస్‌ కార్యకర్తలేనని మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు ఆరోపించారు. హైదరాబాద్‌లో బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి డబ్బులు తీసుకున్న వారే ఇలాంటి ట్రోలింగ్‌ చేశారని విమర్శించారు. కేవలం ఒక ట్వీట్‌ పెట్టడం కాదు, ట్రోలింగ్‌పై హరీశ్‌రావు క్షమాపణ చెప్పాలి. అధికారిక కార్యక్రమంలో మంత్రిని సన్మానిస్తే, దారుణంగా పోస్టులు పెడతారా? కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమం సందర్భంగా వేదికపై జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొండా సురేఖ, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ప్రభాకర్‌ రెడ్డి, స్థానిక ఎంపీగా నేను ఉన్నాను. వేలాది మంది సమక్షంలో జరిగిన కార్యక్రమానికి బూతద్దంలో చూపించి, విమర్శలు చేసేవారిని చూస్తే బాధనిపిస్తోంది. కేటీఆర్‌,  హరీశ్‌రావు దీనిపై స్పందించి సోషల్‌ మీడియాను కంట్రోల్‌ చేసుకుని క్షమాపణ చెప్పాలి. ట్రోలింగ్‌ చేసిన వారి వివరాలు సేకరించి ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశా. అక్కకు జరిగిన అవమానానికి తమ్ముడిగా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నా. అక్కకు మద్దతుగా ఒక వకీలుగా పోస్టులు పెట్టిన వారిని కోర్టుకు ఈడుస్తా అని తెలిపారు.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :